

సీనియర్ దర్శకుడు మహేష్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం వచ్చే నెల 1 న విడుదలకు సిద్ధమవుతోంది. డాక్టర్ రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని మహేష్ చంద్ర సినిమా టీం బ్యానర్ పై దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి స్పందన రావడంతో సినిమాపై హైప్ పెరుగుతోంది.
ఈ సినిమా ప్రేమ, సున్నితమైన హాస్యం, భావోద్వేగాలు, తండ్రి-కూతుళ్ల అనుబంధం వంటి అంశాలతో పాటు యువతకు మంచి సందేశం అందించనుందని దర్శకుడు తెలిపారు. సహజమైన పాత్రలు, నిజ జీవితానికి దగ్గరగా ఉండే కథనం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు. బ్రహ్మానందం వాయిస్ ఓవర్ ప్రత్యేక హైలెట్గా ఉండనుండగా, ఈ సినిమా తన కెరీర్లో టర్నింగ్ పాయింట్ అవుతుందని దర్శకుడు నమ్మకం వ్యక్తం చేశారు.















.jpg&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!