
ఆరోగ్యం

రామ్చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్ర బృందం అభిమానులకు గుడ్న్యూస్ తెలిపింది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వివరాలను అధికారికంగా ప్రకటించింది. జూన్ 1 సాయంత్రం విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో భారీగా ఈ వేడుక నిర్వహించనున్నారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి సంబంధించిన తొలి ప్రధాన ఈవెంట్గా నిలవనుంది.
ఈ సినిమా జూన్ 4న థియేటర్లలో విడుదల కానుంది. జూన్ 3న ప్రీమియర్స్కు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. తెలంగాణలో కూడా స్పెషల్ షోల అవకాశాలు ఉన్నాయి. జూన్ 2న తెలంగాణలో ఈవెంట్ బదులు ప్రెస్మీట్ నిర్వహించే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు సమాచారం. పాన్ ఇండియా విడుదలగా రూపొందుతున్న ఈ సినిమా కోసం ఇప్పటికే భోపాల్, బెంగళూరు, దిల్లీలో ప్రమోషన్స్ నిర్వహించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!