

భావోద్వేగ కుటుంబ కథా చిత్రం 'వెంకట్రామయ్య గారి తాలూకా' ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో ఘనంగా జరిగింది. తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ జానపద గాయని కోమలి మహేందర్ తొట్టె నిర్మించిన ఈ చిత్రంలో దినేష్ కుమార్ హీరోగా, ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్గా నటించారు. సతీష్ ఆవాల కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ సందర్భంగా మాట్లాడిన కల్వకుంట్ల కవిత చిన్న సినిమాలకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కల్పించాలని కోరుతూ, తెలంగాణలో చిన్న చిత్రాలకు తమ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. కుటుంబ బంధాలు, తల్లిదండ్రుల విలువ, మానవ సంబంధాలను హృదయానికి హత్తుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్రబృందం వెల్లడించింది. దర్శకుడు దశరథ్, మురళీధర్ గౌడ్, సుధ, చరణ్ అర్జున్, దినేష్ కుమార్, దివిజ ప్రభాకర్ తదితరులు సినిమా ప్రతి కుటుంబాన్ని ఆలోచింపజేసే భావోద్వేగ చిత్రంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!