
జనరల్

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కేబినెట్ సమావేశంలో అవినీతి, అక్రమాలపై కఠిన వైఖరి ప్రదర్శించారు. అవినీతి ఆరోపణలు రుజువైతే సంబంధిత మంత్రుల పదవులు వెంటనే రద్దు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వంలో అవినీతికి, అక్రమాలకు ఎలాంటి అవకాశం ఉండదని, తప్పు చేసిన వారు ఎవరైనా సరే తక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.
రెండో కేబినెట్ సమావేశంలో మంత్రులకు క్రమశిక్షణ, పారదర్శక పాలనపై సీఎం విజయ్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు తనిఖీల పేరుతో మంత్రులు వెళ్లవద్దని ఆదేశించారు. ప్రజలకు నమ్మకమైన, పారదర్శక పాలన అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!