

టాలీవుడ్ సంక్రాంతి సీజన్లో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజా సాబ్ చిత్రం ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతూ విజయవంతంగా కొనసాగుతోంది. ఫ్యామిలీ ఆడియెన్స్, పిల్లలు ఈ సినిమాను ఎంతో ఆసక్తిగా ఎంజాయ్ చేస్తున్నారని హీరోయిన్ నిధి అగర్వాల్ తెలిపారు. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ఈ సినిమా కోసం టీమ్ మూడు సంవత్సరాల పాటు కష్టపడ్డామని, మొదట మిక్స్డ్ టాక్ వచ్చినా ఇప్పుడు ప్రేక్షకులంతా మూవీని ఆస్వాదిస్తున్నారని చెప్పారు. హారర్ ఫాంటసీ జానర్లో దర్శకుడు మారుతి కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించారని, ప్రభాస్ వన్మ్యాన్ షో సినిమాకు ప్రధాన బలమని ఆమె పేర్కొన్నారు.
ప్రభాస్తో కలిసి పని చేయడం మర్చిపోలేని అనుభవమని నిధి అగర్వాల్ తెలిపారు. ఎంత పెద్ద స్టార్ అయినా ఆయన వినయం, మంచితనం ఎంతో ఇన్స్పైరింగ్గా ఉంటుందని చెప్పారు. అలాగే దర్శకుడు మారుతి స్పష్టతతో సినిమాను తెరకెక్కించారని, భారీ బడ్జెట్తో రాజీ పడకుండా ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారని ప్రశంసించారు. తాను తెలుగు సినిమా పరిశ్రమలో భాగమైనందుకు గర్వంగా ఉందని చెప్పిన నిధి, ప్రస్తుతం తెలుగులో మూడు, హిందీలో రెండు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నానని, భవిష్యత్తులో మంచి పాత్రలు చేయాలనే ఆశతో ముందుకు సాగుతున్నానని వెల్లడించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!