

జ్యోతి పూర్వాజ్, పూర్వాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కిల్లర్ చిత్రం మల్టీ లేయర్ స్క్రీన్ప్లేతో రూపొందిన సరికొత్త సైఫై థ్రిల్లర్గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు సుకు పూర్వాజ్ తెలిపారు. హైదరాబాద్లో జరిగిన టీజర్ రిలీజ్ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొని సినిమా విశేషాలను వెల్లడించింది. థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్లపై పూర్వాజ్, పద్మనాభ రెడ్డి ఎ. నిర్మిస్తున్న ఈ చిత్రంలో మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ డ్రామా, రివేంజ్ మరియు సబ్ కాన్షియస్ ఐడెంటిటీ అంశాలతో టెక్నికల్గా రిచ్గా సినిమా రూపొందినట్లు టీజర్ సూచిస్తోంది.
ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, కంటెంట్ ఆధారిత సినిమాగా కిల్లర్ ప్రత్యేక గుర్తింపు పొందుతుందని నమ్మకం వ్యక్తం చేసింది. హీరోయిన్ జ్యోతి పూర్వాజ్ ఈ చిత్రంలో పలు భిన్నమైన పాత్రల్లో నటించడం తనకు డ్రీమ్ అవకాశమని పేర్కొన్నారు. మహిళా ప్రధాన కథాంశంతో రూపొందిన ఈ సైఫై థ్రిల్లర్ అన్ని వర్గాల ప్రేక్షకులకు సులభంగా అర్థమయ్యేలా తెరకెక్కించామని దర్శకుడు తెలిపారు. త్వరలో ట్రైలర్ విడుదల చేసి, అనంతరం సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు తీసుకురానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!