

వెటరన్ నటుడు వెంకటేశ్ దగ్గుబాటి, అడివి శేష్ మరియు మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన డెకాయిట్ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్లో ఘనంగా జరిగిన ఈ వేడుకలో ఆయన చిత్ర బృందాన్ని అభినందిస్తూ సినిమా విజయంపై నమ్మకం వ్యక్తం చేశారు. రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ, పంజా సినిమా నుంచే శేష్ను గమనిస్తున్నానని తెలిపారు. అతను భవిష్యత్తులో మంచి నటుడు అవుతాడని అప్పుడే అనిపించిందని, ప్రతి సినిమాతో తన ప్రతిభను నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్నాడని ప్రశంసించారు. మృణాల్ ఠాకూర్ నటన గురించి మాట్లాడుతూ, ఆమె హావభావాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అన్నారు. అలాగే నిర్మాత సుప్రియా యార్లగడ్డను ప్రత్యేకంగా అభినందించారు. సుప్రియతో పాటు తనకు ఇష్టమైన సురేంద్ర కోసం ఈ వేడుకకు వచ్చానని చెప్పడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.















.jpg&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!