
క్రీడలు

ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా వారణాసిలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇలాంటి సమయంలో మహేష్ బాబు తదుపరి సినిమా యానిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ఉండొచ్చనే టాక్ టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ దాదాపు ఫైనల్ అయినట్లు సమాచారం. సందీప్ ప్రస్తుతం స్పిరిట్ షూటింగ్లో బిజీగా ఉన్నారు.
ఆ సినిమా పూర్తైన వెంటనే మహేష్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని తెలుస్తోంది. అప్పటికి వారణాసి షూటింగ్ కూడా ముగుస్తుందని అంటున్నారు. ఈ చిత్రానికి ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ నిర్మాతగా ఉండనున్నట్లు సమాచారం. బుచ్చిబాబు సానాతో సినిమా అనే వార్తలు మాత్రం కేవలం ప్రచారమేనని టాక్.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!