
టెక్నాలజీ

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవర’ సినిమా సీక్వెల్ పనులు ఈ ఏడాది మే నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉందని నిర్మాత ప్రకటించారు. వచ్చే సంవత్సరం విడుదలకు ప్రయత్నిస్తామని వివరించారు. గతేడాది సెప్టెంబరులో నిర్మాణ సంస్థ ‘దేవర 2’ పై ఒక పోస్టర్ రిలీజ్ చేసి, ఈ పేరు ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకునే విధంగా ఉంటుందని వెల్లడించింది. దీనితో అభిమానులు ఈ సీక్వెల్ కోసం మరింత ఉత్సాహంగా ఉన్నారు.
తాను పంచిన ప్రేమ, తాను చూపిన భయం మర్చిపోలేదని. ఈ సీక్వెల్ కోసం అభిమానులు సిద్ధంగా ఉండాలనేది తెలియజేశారు. ‘దేవర’ 2024 లో విడుదలై మంచి ఆదరణ పొందిన నేపథ్యంలో, సీక్వెల్ పై అభిమానుల అంచనాలు ఎంతో ఎక్కువని, తాజాగా ఇచ్చిన అప్డేట్ ఉత్సాహంను మరింత పెంచింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!