
గాసిప్స్

గోదావరి నది తీరంలో మెగాస్టార్ చిరంజీవి హాజరుతో అద్భుతమైన వేడుకలకు వేదిక సిద్ధమవుతోంది. ‘మన శంకర వర ప్రసాద్ గారు’గా చిరంజీవిని ఘనంగా ఆహ్వానించే ఈ ప్రత్యేక కార్యక్రమం రాజమండ్రిలోని పుష్కరాల రేవులో నిర్వహించనున్నారు. ఈ వేడుక గోదావరి తీరాన్ని భక్తి, అభిమాన ఉత్సాహం, సినీ సంబరాలతో నింపనుంది.
ఈనెల 3 వ తేదీ ఉదయం 9.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి విన్టేజ్ స్వాగ్లో అభిమానులను అలరించనున్నారు. దర్శకుడు అనిల్ రవిపూడి, నిర్మాతలు సుష్మిత కొణిదెల, సాహు గరపాటి సమక్షంలో ఈ ఏడాది నిర్వహించబడుతున్న ఈ వేడుక మెగా అభిమానులకు చిరస్మరణీయంగా నిలవనుంది. రేపు జరగనున్న ఈ మెగా ఈవెంట్ కోసం రాజమండ్రి నగరం మొత్తం ప్రత్యేకంగా ముస్తాబైంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!