

యూత్ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన ‘రిస్క్’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ‘సంపంగి’, ‘16’ వంటి సినిమాలకు చార్ట్ బస్టర్ మ్యూజిక్ అందించిన ఘంటాడి కృష్ణ దర్శకత్వం వహిస్తూ స్వయంగా సంగీతం అందించిన ఈ చిత్రంలో సందీప్ అశ్వ, సన్యా ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. జూన్ రెండో వారంలో సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి మాట్లాడుతూ ట్రైలర్ చాలా ఆకట్టుకుందని, యూత్కు నచ్చే ఎంటర్టైనర్గా సినిమా ఉంటుందని అన్నారు. హీరో సందీప్ అశ్వ మాట్లాడుతూ నటనపై తన ప్యాషన్ను, పదేళ్ల ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. ఫస్ట్ హాఫ్లో ఫ్రెండ్షిప్, లవ్, కామెడీ ఉండగా సెకండ్ హాఫ్ థ్రిల్లింగ్గా ఉంటుందని తెలిపారు. దర్శకుడు ఘంటాడి కృష్ణ సినిమాను ఎంతో కష్టంతో రూపొందించామని చెప్పారు. పృథ్వి, ఆశు రెడ్డి, నిర్మాతలు సహా పలువురు చిత్ర బృందాన్ని ప్రశంసించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!