

బీఆర్ చోప్రా తెరకెక్కించిన ‘మహాభారతం’లో యుధిష్ఠిరుడిగా గుర్తింపు పొందిన నటుడు గజేంద్ర చౌహాన్, రణ్బీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘రామాయణ’ చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాకు ‘రామాయణ’ అనే పేరును ఎందుకు ఉపయోగిస్తున్నారో ప్రశ్నించిన ఆయన, సంప్రదాయంగా హిందీలో ‘రామాయణం’ను ‘రామాయణ్’గా పిలుస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రణ్బీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో ఎలా కనిపిస్తారనే అంశంపై కూడా ఆయన సందేహాలు వ్యక్తం చేశారు.
నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’లో రణ్బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. యశ్ కీలక పాత్రలో కనిపించనుండగా, రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా, షీబా చద్దా తదితరులు కూడా నటిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రంపై గజేంద్ర చౌహాన్ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!