

‘డ్రాగన్’ విషయంలో తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని మలయాళ నటుడు టోవినో థామస్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘డ్రాగన్’ చిత్రంలో తాను భాగం కాదని ఇటీవల ఆయన స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఆయన తాజాగా స్పందించారు.
తాను చెప్పిన విషయాలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, ‘డ్రాగన్’లో నటించడం తనకు ఇష్టం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోందని తెలిపారు. కానీ అది నిజం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి అపార్థాలు తలెత్తే అవకాశముండటం వల్లనే కొన్ని సందర్భాల్లో మాట్లాడటాన్ని నివారిస్తానని పేర్కొన్నారు. ఒకే సమయంలో అనేక పనులు చేయలేనని, తన పని విధానం భిన్నంగా ఉంటుందని, దానినే చాలా కాలంగా అనుసరిస్తున్నానని చెప్పారు. తన వ్యాఖ్యలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారని ఆయన అన్నారు. అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్పై తనకు ఎంతో గౌరవం, అభిమానం ఉందని టోవినో థామస్ తెలిపారు. ఆయన వర్కింగ్ స్టైల్ను తాను ఎంతో ఇష్టపడుతున్నానని కూడా పేర్కొన్నారు.






.jpeg&w=3840&q=75)




.avif&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!