

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి హరీశ్ రావు సిద్దాపూర్ డంప్ యార్డు ఏర్పాటు కోసం జారీ చేసిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్లో డంప్ యార్డు ఏర్పాటు నిర్ణయంతో ఆందోళనకు గురైన రైతులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హైదరాబాద్లో ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు. వారి సమస్యలను వినిన హరీశ్ రావు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు.
86 ఎకరాల పచ్చని వ్యవసాయ భూముల్లో, జనావాసాల సమీపంలో డంప్ యార్డు ఏర్పాటు చేయడం అనాలోచిత నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. గుట్ట చెరువు నీరు కలుషితం కావడం వల్ల సాగు నీరు, తాగునీటికి ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించారు. అలాగే జహంగీర్ పీర్ దర్గాపై కూడా కాలుష్య ప్రభావం పడుతుందని తెలిపారు. గతంలో ఇదే ప్రాంతంలో ఐటీ పార్క్ నిర్మాణం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలని బీఆర్ఎస్ ప్రణాళికలు రూపొందించినట్లు గుర్తు చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!