
జనరల్

దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి తన తొలి చిత్రం ‘దీవాన’ గురించి తన ప్రయాణాన్ని వివరించారు. హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న ఈ సినిమాను అర్హ మీడియా, వి స్టూడియోస్ నిర్మించగా, ఈ నెల 19న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంతో స్మేయా మణిమేఘలై కూడా పరిచయం అవుతున్నారు.
ఒక టీవీ యాంకర్ను చూసిన చిన్న ఆలోచన నుంచే ‘దీవాన’ కథ పుట్టిందని దర్శకుడు తెలిపారు. ఆ ఆలోచన ప్రేమ, భావోద్వేగాలు కలగలిసిన కమర్షియల్ కథగా మారిందని, సంవత్సరాలుగా అనేక మార్పులతో స్క్రిప్ట్ను అభివృద్ధి చేశానని చెప్పారు.
దాదాపు పదేళ్లపాటు కార్పొరేట్ ఉద్యోగం చేసిన తరువాత సినిమా కోసం ఉద్యోగాన్ని వదిలేసి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని ఆయన తెలిపారు. తిరస్కారాలు, ఆర్థిక సమస్యలు ఎదురైనా భావోద్వేగమే బలమైన కమర్షియల్ అంశమని నమ్మి ముందుకు సాగానని చెప్పారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!