

తమిళ సినీ వర్గాల్లో గత కొన్ని నెలలుగా నటి త్రిష వ్యక్తిగత జీవితం గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్తో ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉందని, ఇద్దరూ త్వరలో వివాహం చేసుకోబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. అయితే ఈ వార్తలపై త్రిష ఇప్పటివరకు నేరుగా స్పందించకపోవడంతో రూమర్లకు మరింత ఊతం లభించింది. కానీ తాజాగా ఆమె చేసిన ఒక చిన్న సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది.
తన పెంపుడు కుక్క ఫోటోను పంచుకున్న త్రిష, “నా వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకునే హక్కు దీనికే ఉంది” అనే భావం వచ్చేలా క్యాప్షన్ ఇచ్చారు. ఎవరినీ ప్రస్తావించకపోయినా, ఇది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారాలపై ఆమె ఇచ్చిన సమాధానంగా నెటిజన్లు భావిస్తున్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై వస్తున్న ఊహాగానాలు హద్దులు దాటుతున్న నేపథ్యంలో త్రిష తనదైన శైలిలో గట్టి సందేశం ఇచ్చిందని సినీ వర్గాలు అంటున్నాయి. ఆమె తన పనుల్లో బిజీగా ఉండి ఈ రూమర్లను పట్టించుకోవడం లేదనే సంకేతం కూడా ఈ పోస్ట్ ద్వారా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!