

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ఫ్యామిలీ డ్రామా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మమిత బైజు కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం విడుదలైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ను దాటినట్లు చిత్రబృందం వెల్లడించింది. అంతర్జాతీయ పిస్టల్ షూటర్గా, జీవితంలో అనుకోని మలుపులను ఎదుర్కొనే వ్యక్తిగా సూర్య భావోద్వేగభరితమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
ఈ విజయంతో సూర్య కెరీర్లో అత్యంత వేగంగా రూ.100 కోట్ల క్లబ్లోకి ప్రవేశించిన చిత్రంగా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నిలిచింది. కుటుంబ భావోద్వేగాలు, సూర్య నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుండటంతో సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే ఈ స్థాయి వసూళ్లు సాధించడం సూర్యకు తమిళనాడు బాక్సాఫీస్ వద్ద ఉన్న క్రేజ్ను మరోసారి చాటిచెబుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!