

సింగిల్ స్క్రీన్ థియేటర్ల పర్సెంటేజ్ మోడల్పై కొనసాగుతున్న సంక్షోభంపై తెలంగాణ ఎగ్జిబిటర్స్ ప్రతినిధులు, నిర్మాత కే. ఎల్. నారాయణ, అల్లు అరవింద్, సురేష్ బాబు తదితరులు మెగాస్టార్ చిరంజీవి తో సమావేశమయ్యారు. సింగిల్ స్క్రీన్స్ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, భయాలు, రెవెన్యూ పంపకాలపై ఉన్న సమస్యలను వారు వివరించారు. గతంలో ఏర్పాటు చేసిన కమిటీ నివేదికల వివరాలన్నీ చిరంజీవి పరిశీలించినట్లు సమాచారం.
సమావేశం అనంతరం మాట్లాడిన దిల్ రాజు, ఇది ‘పెద్ది’ సినిమా గురించి కాదని, మొత్తం తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్య అని స్పష్టం చేశారు. తెలుగు సినీ పరిశ్రమకు తెలుగు ఫిలిం ఛాంబర్ అత్యున్నత సంస్థ అని పేర్కొన్న చిరంజీవి, ఛాంబర్ నిర్ణయాలను అందరూ గౌరవించాలని సూచించారు. కమిటీ ఏర్పాటైన తర్వాత మీడియా ముందు విభేదాలు వ్యక్తం చేయడం పరిశ్రమ ఐక్యతకు మంచిది కాదన్నారు. గత కమిటీలపై ఉన్న అసంతృప్తిని గుర్తించిన ఆయన, కొత్త కమిటీ జూన్ 30లోపు అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా నివేదిక అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరో రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!