

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్ మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ (APSFTVTDC) చైర్మన్గా పి. భరత్ భూషణ్, వైస్ చైర్మన్గా సీహెచ్ మెహర్ రమేష్ ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్టీఆర్ పరిపాలనా భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భరత్ భూషణ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో సినిమా, టెలివిజన్ మరియు నాటక రంగాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణలకు కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన సినిమా, కళారంగాలకు మళ్లీ ప్రాధాన్యం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నంది అవార్డులు, నంది నాటకోత్సవాలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, సినిమా షూటింగులకు సింగిల్ విండో సిస్టమ్ ఏర్పాటు అవసరమని సూచించారు. అలాగే స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లు, రికార్డింగ్ సదుపాయాల కోసం నిర్మాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ను మళ్లీ సినీ పరిశ్రమకు కీలక కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!