
గాసిప్స్

భారత వాతావరణ శాఖ (IMD) ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలకు భారీ వర్షాల నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాతావరణ పరిస్థితులు మరికొన్ని గంటల పాటు కొనసాగనున్నాయని అధికారులు తెలిపారు.
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఘజియాబాద్లో రోడ్లపై భారీగా నీరు నిలవడంతో వాహనాల రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జాగ్రత్త చర్యగా కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తూ, అవసరం లేకుండా బయటకు వెళ్లవద్దని ప్రజలకు సూచించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!