
లెజెండరీ నటుడు తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘అసుర సంహారం’ టీజర్ ఘనంగా విడుదలైంది. శ్రీ సాయి ప్రవర్తిక బోయళ్ళ సమర్పణలో, శ్రీ సాయి తేజో సెల్యులాయిడ్స్ బ్యానర్పై సాయి శ్రీమంత్, శబరిష్ బోయెళ్ళ నిర్మిస్తున్న ఈ సినిమాను కిషోర్ శ్రీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గ్రామీణ నేపథ్యంతో, ఒక విలేజ్ క్రైమ్ డ్రామాగా రూపొందించబడింది.
తనికెళ్ల భరణి ఇప్పటికే 750 కి పైగా చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ చిత్రంలో ఆయన విలేజ్ డిటెక్టివ్ పాత్రలో, మిధున ప్రియ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తనికెళ్ల భరణి మాట్లాడుతూ, "అసుర సంహారం అంటే చెడుపై మంచి సాధించిన విజయం. డైరెక్టర్ కిషోర్ శ్రీకృష్ణ మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. షూటింగ్ లో NRI శబరిష్, మిధున ప్రియ చాలా సహకరించారు", అని తెలిపారు.
దర్శకుడు కిషోర్ శ్రీకృష్ణ చెప్పారు, "భరణి గారు విలేజ్ డిటెక్టివ్ పాత్రలో భిన్నమైన అభినయం చూపించారు. ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుందని నమ్మకం ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వేగంగా జరుగుతోంది. మార్చి లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం", అని తెలిపారు. నటి మరియు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మిధున్ ప్రియా కూడా, “నెల్లూరు చుట్టూ షూట్ చేసాము, ప్రేక్షకుల సహకారం అవసరం, మార్చి లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి”, అని చెప్పింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!