

‘ధురందర్’ విజయానంతరం దర్శకుడు ఆదిత్య ధర్ మరో ప్రతిష్ఠాత్మక చారిత్రక చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అస్సాం చరిత్రలో చిరస్మరణీయుడైన వీరుడు లచిత్ బోర్ఫుకాన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని పాన్ ఇండియా స్థాయిలో భారీ చిత్రాన్ని రూపొందించే దిశగా ప్రాథమిక కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్కు సంబంధించి అస్సాం ప్రభుత్వంతో తొలి దశ చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపిన వివరాల ప్రకారం, ఆగస్టులో ఆదిత్య ధర్ అస్సాంను సందర్శించి చారిత్రక ఆధారాలు, చిత్రీకరణ ప్రాంతాలు, నిర్మాణ ప్రణాళికలపై చర్చించనున్నారు. 1671లో జరిగిన సరాయిఘాట్ యుద్ధంలో మొఘల్ సేనలను ఓడించి అస్సాంను రక్షించిన మహా యోధుడిగా లచిత్ బోర్ఫుకాన్ చరిత్రలో నిలిచారు. అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా, ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే మరో భారీ చారిత్రక పాన్ ఇండియా చిత్రంగా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!