
జనరల్

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. తొలి విచారణకు ఆన్లైన్ ద్వారా హాజరయ్యేందుకు ఆయన చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.
ప్రస్తుతం ముంబైలో సినిమా షూటింగ్లో ఉన్న కారణంగా వర్చువల్ హాజరుకు అనుమతి ఇవ్వాలని అల్లు అర్జున్ కోరినట్లు సమాచారం. అయితే కోర్టు ఆ అభ్యర్థనను అంగీకరించకుండా సోమవారం వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టం చేసింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ను A11 నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే. ఈ కేసు ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!