

టీమ్ఇండియా వరుసగా రెండు సిరీస్ల్లో పరాజయం పాలవడంతో జట్టు కోచింగ్ సిబ్బంది, సెలక్షన్ కమిటీపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. తొలుత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్థానంలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ను నియమిస్తారనే వార్తలు వినిపించాయి. భారత్-ఏ జట్టుతో పాటు సీనియర్ జట్టుకు కూడా కోచింగ్ బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం లక్ష్మణ్కు ఉండటంతో ఆ ప్రచారానికి బలం చేకూరింది. అయితే తాజా సమాచారం ప్రకారం, ఆయనను ప్రధాన కోచ్గా కాకుండా బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవికి పరిశీలిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
ప్రస్తుతం చీఫ్ సెలక్టర్గా ఉన్న అజిత్ అగార్కర్ పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబర్తో ముగియనుండగా, ఆయన స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్కు అవకాశం దక్కే అవకాశాలపై చర్చ జరుగుతోంది. మరోవైపు వచ్చే వన్డే ప్రపంచకప్ వరకు గౌతమ్ గంభీర్-అజిత్ అగార్కర్ జోడీనే కొనసాగించే ఆలోచనలో బీసీసీఐ ఉందన్న ప్రచారం కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న టీమ్ఇండియా అనంతరం వెస్టిండీస్, బంగ్లాదేశ్ పర్యటనలు ఉండటంతో కీలక నిర్ణయాలను వచ్చే నెలలో జరిగే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం తర్వాతే ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!