

కామన్వెల్త్ గేమ్స్ ముగిసిన మూడు రోజుల తర్వాత కూడా పలువురు అథ్లెట్ల ఆచూకీ తెలియకపోవడంతో స్కాట్లాండ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మీడియా కథనాల ప్రకారం ఉగాండా బాక్సింగ్ జట్టుకు చెందిన నలుగురు బాక్సర్లు స్వదేశానికి వెళ్లాల్సిన విమానం ఎక్కలేదు. అలాగే పాకిస్థాన్కు చెందిన ఓ బాక్సర్ కూడా అదృశ్యమైనట్లు సమాచారం. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టగా, ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి తుది వివరాలు వెల్లడించలేదు.
కొన్ని మీడియా కథనాల ప్రకారం ఉగాండాకు చెందిన కనీసం ఒక బాక్సర్ స్కాట్లాండ్లో ఆశ్రయం కోరుతూ అక్కడే ఉండి తన క్రీడా జీవితాన్ని కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయాన్ని ఉగాండా జట్టు అధికారులు అధికారికంగా ధృవీకరించలేదు. మరోవైపు పాకిస్థాన్ బాక్సర్ తన పాస్పోర్ట్ జట్టు మేనేజ్మెంట్ వద్దే ఉన్నప్పటికీ కనిపించకుండా పోయినట్లు సమాచారం. ఇలాంటి ఘటనలు గత కామన్వెల్త్ గేమ్స్లో కూడా చోటుచేసుకున్నాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!