

అలియా భట్ ప్రస్తుతం ఫ్రాన్స్లో జరుగుతున్న 79వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ చిత్ర పరిశ్రమలో పురుషాధిక్యతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతీయ బాక్సాఫీస్ వద్ద ఎక్కువగా హీరో ప్రధాన చిత్రాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని, మహిళా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సినిమాలు తక్కువగా రూపొందుతున్నాయని ఆమె పేర్కొన్నారు. బార్బీ వంటి మహిళా ప్రధాన చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా విజయవంతం అవుతున్నాయని గుర్తుచేసిన అలియా, భారతీయ సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని కథలను రూపొందించాలని అన్నారు.
హీరో ప్రధాన యాక్షన్ సినిమాలకు తాను వ్యతిరేకం కాదని, కానీ సినిమా అందరి కోసం ఉండాలని అలియా స్పష్టం చేశారు. ప్రేక్షకులు కేవలం హీరోలను మాత్రమే కాదు, మంచి కథలను కూడా ఆదరిస్తారని చెప్పారు. అయితే ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. గతంలో యానిమల్ సినిమాపై వచ్చిన విమర్శల సమయంలో అలియా ఆ చిత్రాన్ని సమర్థించడాన్ని గుర్తు చేస్తూ నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. అలాగే ‘ధురంధర్’ అంశంపై ఆమె మౌనం పాటించడంపైనా కొందరు ప్రశ్నిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!