

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ వరల్డ్ చిత్రం ‘వారణాసి’లో నటిస్తున్నారు. మైథాలజీ, టైమ్ ట్రావెల్, అడ్వెంచర్ అంశాల సమ్మేళనంగా రూపొందుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు ఇందులో విభిన్న గెటప్స్లో కనిపించనున్నారని సమాచారం. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారనే ప్రచారం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
ఇంకా ‘వారణాసి’ విడుదలకు సమయం ఉండగానే మహేష్ బాబు తదుపరి సినిమా ఎవరితో ఉండబోతుందనే చర్చ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పేరు ముందువరుసలో వినిపిస్తోంది. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి విజయవంతమైన చిత్రాలతో తనదైన ముద్ర వేసుకున్న సందీప్, గతంలోనే మహేష్తో సినిమా చేయాలనే ఆసక్తిని వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం ఆయన ‘స్పిరిట్’, ‘యానిమల్ పార్క్’ చిత్రాలతో బిజీగా ఉండటంతో ఈ కాంబినేషన్ ఎప్పుడు సాకారం అవుతుందనే దానిపై ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!