
గాసిప్స్

‘మేజర్’ సినిమా విడుదలై మూడేళ్లు గడిచినా అడివి శేష్ – మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కుటుంబం మధ్య భావోద్వేగ బంధం అవిఛిన్నంగా కొనసాగుతోంది. చిత్రీకరణ సమయంలోనే “మీకు జీవితాంతం కుమారుడిలా ఉంటాను” అని ఇచ్చిన మాటను శేష్ ఇప్పటికీ అక్షరాలా నిలబెట్టుకుంటున్నారు.
పండుగలు, జయంతులు, వర్ధంతులు… ఏ సందర్భంలోనూ బెంగళూరులో ఉండే మేజర్ సందీప్ తల్లిదండ్రులను అడివి శేష్ ఒంటరిగా వదలడం లేదు. ఇటీవల సందీప్ వర్ధంతి సందర్భంగా కూడా శేష్ వెళ్లి కుటుంబంతో కలిసి నివాళులర్పించి, ఓదార్చి వచ్చారు.
సినిమా ముగిసినా సంబంధం ముగియలేదు. “సందీప్ను తిరిగి ఇచ్చినట్లుంది” అని మేజర్ తల్లి ధనలక్ష్మి గారు భావోద్వేగంతో చెప్పిన మాటలు అడివి శేష్ నిజాయితీకి, మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!