

యంగ్ హీరో ఆది సాయి కుమార్ చాలా కాలం తర్వాత శంభాల సినిమాతో బ్లాక్బస్టర్ హిట్ సాధించి మళ్లీ ఫాంలోకి వచ్చాడు. ఈ సినిమా ఓటిటీలో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ జోష్తో ఆయన కొత్త సినిమా సైరాభానును ప్రకటించాడు. ఈ సినిమాకు ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాంధవి శ్రీధర్ హీరోయిన్గా నటిస్తోంది. హిందూ–ముస్లిం ప్రేమకథ నేపథ్యంలో, కామెడీ టచ్తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఇటీవల విడుదలైన ఈ సినిమా కలర్ఫుల్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. “ప్రేమ, నమ్మకం మరియు విధితో నిండిన సరదా ప్రయాణం” అనే ట్యాగ్లైన్ ఆసక్తిని పెంచుతోంది. పోస్టర్లో చార్మినార్, విశాఖపట్నం బీచ్ రోడ్, రాజమండ్రి, గోదావరి బ్రిడ్జ్ వంటి అందమైన లొకేషన్లు కనిపిస్తున్నాయి. రాజేష్ దండా హాస్య మూవీస్ బ్యానర్పై ఈ సినిమా నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తుండగా, రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది.









.jpeg&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!