

పవన్ కళ్యాణ్ ఓ పక్క డిప్యూటీ సీఎం గా బిజీగా ఉండటంతో చేతిలో ఉన్న సినిమాలు చేసి ఆపేస్తారనే అనుకుంటున్నా ఫ్యాన్స్, కానీ OG పెద్ద హిట్ అవడంతో OG 2 కూడా చేస్తానని ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చారు. త్వరలో ఉస్తాద్ భగత్ సింగ్ ఎలాగూ రానుంది. అయితే తాజాగా ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ రోజు ఫుల్ సంతోషాన్ని ఇచ్చే వార్త ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించారు. నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మాణంలో, దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉండటం, ఇతర సినిమాల కారణంగా ఈ ప్రాజెక్ట్ పక్కన పెట్టినట్లుగా అందరూ భావించినప్పటికీ, తాజాగా ఈ సినిమాను మళ్లీ కొత్తగా ప్రకటించారు.
రామ్ తాళ్లూరి మరియు సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్తో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఈ ప్రాజెక్ట్ను ప్రకటించారు. రామ్ తాళ్లూరి ప్రస్తుతం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు. ఆయన ఈ సందర్భంగా తన కొత్త నిర్మాణ సంస్థ జైత్ర రామ్ మూవీస్ బ్యానర్పై, పవన్ కళ్యాణ్ పేరు పెట్టిన ఈ సంస్థ ద్వారా సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీతో కలిసి పవన్ కళ్యాణ్తో సినిమా చేయబోతున్నట్లు వెల్లడించారు.
ఇటీవల పవన్ కళ్యాణ్ తక్కువ హెయిర్తో కొత్త లుక్లో కనిపిస్తున్నారు. ఈ లుక్ ఈ సినిమా కోసమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. డిప్యూటీ సీఎం గా ఎంత బిజీగా ఉన్నా, కొత్త సినిమా ప్రకటనతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. రామ్ తాళ్లూరి గతంలో SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నేల టికెట్, చుట్టాలబ్బాయి, మెకానిక్ రాకీ వంటి సినిమాలను నిర్మించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!