

రాజకీయాలు, సినిమాలు రెండింటినీ సమాంతరంగా నడిపించడం చాలా అరుదుగా కనిపించే విషయం. అలాంటి ప్రత్యేక గుర్తింపును ఇప్పుడు దళపతి విజయ్ సొంతం చేసుకోబోతున్నారు. ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో తన సినిమా విడుదలకు సిద్ధమవుతుండటంతో ఆయన పేరు మరోసారి చర్చనీయాంశమైంది. గతంలో ఎంజీఆర్, ఎన్టీఆర్ సీఎంలుగా కొనసాగుతూనే తమ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన నేపథ్యంలో ఇప్పుడు విజయ్ కూడా అదే జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషంగా మారింది. ఆయన చివరి చిత్రంగా ప్రచారం జరుగుతున్న ‘జన నాయగన్’ జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే చిత్రానికి సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ ఇవ్వడం అభిమానుల్లో కొంత నిరాశను కలిగించింది. ముఖ్యంగా చిన్నారుల కోసం ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించాలన్న విజయ్ రాజకీయ పార్టీ ఆలోచనలకు సెన్సార్ నిబంధనలు అడ్డుగా నిలిచాయి. తెలుగు హిట్ ‘భగవంత్ కేసరి’ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో పలు కీలక మార్పులు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా రెండో భాగం, విలన్ ట్రాక్, ఫ్లాష్బ్యాక్లతో పాటు క్లైమాక్స్ను భారీ స్థాయిలో తెరకెక్కించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడిన ఈ చిత్రం తమిళనాడు, ఓవర్సీస్ మార్కెట్లలో రికార్డు వసూళ్ల దిశగా దూసుకెళ్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!