

ఇజ్రాయెల్కు చెందిన ప్రముఖ రక్షణ సంస్థ రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ భారత్లో ఐరన్ డోమ్ ఇంటర్సెప్టర్ మిసైళ్ల ఉత్పత్తి ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం పలువురు భారతీయ రక్షణ తయారీ సంస్థలతో చర్చలు జరుగుతున్నాయని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదిత ఉత్పత్తి కేంద్రం ద్వారా ఎగుమతి అవసరాలతో పాటు ఇజ్రాయెల్కు అవసరమైన ఇంటర్సెప్టర్ మిసైళ్ల సరఫరాను కూడా బలోపేతం చేయాలని రఫేల్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఐరన్ డోమ్ ఇంటర్సెప్టర్ మిసైళ్లను ఇజ్రాయెల్లోని రఫేల్ తయారీ కేంద్రంలో ఉత్పత్తి చేస్తున్నారు. గత ఏడాది అమెరికాలో కూడా రేథియాన్ భాగస్వామ్యంతో మరో ఉత్పత్తి కేంద్రం కార్యకలాపాలు ప్రారంభించింది. ఇప్పుడు భారత్లో కూడా ఉత్పత్తి ప్రారంభమైతే, భారత్-ఇజ్రాయెల్ రక్షణ సహకారంలో ఇది మరో కీలక మైలురాయిగా నిలవనుంది. అయితే, ఈ ప్రణాళికపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!