

నొప్పి, జ్వరం వంటి సాధారణ సమస్యలకు తక్షణ ఉపశమనం కోసం చాలామంది బలమైన పెయిన్కిల్లర్స్ను వాడుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. అయితే నిమెసులైడ్ వంటి కొన్ని మందులు దీర్ఘకాలంలో తీవ్రమైన ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మందులు కాలేయం, మూత్రపిండాలు, కడుపుపై తీవ్ర దుష్ప్రభావాలు చూపుతాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి.
లక్షణాలు వెంటనే బయటపడకపోయినా, శరీరంలో అంతర్గతంగా నష్టం జరుగుతుందని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, మద్యం సేవించే వారు ఈ మందులను డాక్టర్ సలహా లేకుండా వాడితే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని సూచిస్తున్నారు. అందువల్ల స్వయంగా మందులు వాడకుండా, వైద్యుల సూచనలతోనే చికిత్స తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
గమనిక : మేము అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎటువంటి బాధ్యత వహించము. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని, న్యూట్రిషనిస్ట్ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.





.jpg&w=3840&q=75)


_1771477764226.jpg&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!