

టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న వివాహం రాజస్థాన్లోని ఉదయ్పూర్ లో రాయల్ స్థాయిలో జరిగింది. ఈ నెల 24 నుండి 26 వరకు మూడు రోజుల పాటు ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. మొదటి రోజు సంగీత్, రెండో రోజు హల్దీ మరియు మెహందీ, చివరి రోజు తెలుగూ – కొడవ సంప్రదాయాల ప్రకారం రెండు పద్ధతుల్లో పెళ్లి జరిగింది.
ఈ పెళ్లి వేదికగా ది మెమొంటోస్ లగ్జరీ హోటల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉదయ్పూర్ నగరానికి దూరంగా ఆరావళి పర్వత సానువుల్లో నిర్మితమైన ఈ హోటల్ దాదాపు 45 మీటర్ల చదరపు మీటర్ల విస్తీర్ణంలో, 117 గదులతో విస్తరించి ఉంది. ఇందులో స్టాండర్డ్ రూమ్స్ ధరలు ఒక్క రాత్రికి 20 వేల రూపాయల నుంచి 50 వేల రూపాయలు. అలాగే ప్రైవేట్ విల్లా ధర ఒక్కరాత్రికి 70 వేల రూపాయలు. దానితో పాటు లగ్జరీ వెడ్డింగ్ ఖర్చు 90 లక్షల రూపాయల నుంచి 2.5 కోట్ల రూపాయలు (ఇందులో వసతి, భోజన వసతులు, డెకరేషన్ ఖర్చులు కలిపి). అలా మొత్తంగా ఉదయ్పూర్లో డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నలు అక్షరాల 4 నుంచి 6 కోట్ల రూపాయల రేంజ్లో ఖర్చు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
విజయ్ మరియు రష్మిక దుస్తులు, ఆభరణాలు రాజరిక శైలిలో రూపుదిద్దుకున్నాయి. విజయ్ పట్టు పంచె, ఎరుపు అంగవస్త్రం ధరించగా, రష్మిక గోల్డ్ బోర్డర్ ఉన్న ఎరుపు చీరలో మెరిసిపోయింది. రష్మిక ధరించిన నగలను ఒక ప్రముఖ ఆభరణాల సంస్థ 10 నెలల పాటు ప్రత్యేకంగా తయారు చేసింది. అతిథుల కోసం ఆంధ్ర, తెలంగాణ, కొడవ మరియు జపనీస్ వంటకాలతో ప్రత్యేక మెనూ సిద్ధం చేశారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!