

సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలో రెండు దశాబ్దాలకు పైగా అగ్ర కథానాయికగా కొనసాగుతున్న త్రిష మరోసారి వార్తల్లో నిలిచారు. వయసుతో సంబంధం లేకుండా వరుస అవకాశాలను అందుకుంటూ పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ‘పొన్నియిన్ సెల్వన్’ విజయానంతరం త్రిష కెరీర్ మంచి ఊపందుకున్నప్పటికీ, ఆ తర్వాత వచ్చిన ‘విడాముయర్చి’, ‘థగ్ లైఫ్’ చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో విమర్శలను ఎదుర్కొన్నారు.
అయితే తాజాగా విడుదలైన ‘కరుప్పు’ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో త్రిష మళ్లీ ఫుల్ ఫామ్లోకి వచ్చారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ భారీ పాన్ ఇండియా తమిళ చిత్రానికి ఆమె రూ.12 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పారితోషికం విషయంలో చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తలపై అధికారిక ధృవీకరణ మాత్రం వెలువడలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!