

బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లకు అద్భుతమైన స్పందన రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషనల్ కార్యక్రమాలను చిత్రబృందం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా జూన్ 2న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.
ఇదిలా ఉండగా, ఈ ఈవెంట్కు నందమూరి బాలకృష్ణ చీఫ్ గెస్ట్గా హాజరుకానున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. NBK111 చిత్రాన్ని కూడా నిర్మిస్తున్న నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రత్యేకంగా బాలయ్యను ఆహ్వానించినట్లు ఫిలింనగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ మరియు రామ్ చరణ్ మధ్య ఉన్న ఆత్మీయత కారణంగా ఈ కలయికపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. అయితే ఈ వార్తపై చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!