
జనరల్

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాపై కొత్త వివాదం చెలరేగింది. నామ్ తమిళర్ కచ్చి (NTK) పార్టీ అధినేత సీమాన్, తమిళుల ఆరాధ్య దైవమైన మురుగన్ (సుబ్రహ్మణ్య స్వామి)ని ఉత్తరాంధ్ర ప్రాంత దైవంగా చూపుతున్నారనే ప్రచారంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటువంటి చిత్రీకరణ తమిళుల మనోభావాలను దెబ్బతీస్తుందని ఆయన పేర్కొన్నారు.
సినిమాను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేసిన సీమాన్, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సుబ్రహ్మణ్య స్వామి తమిళనాడుతో ముడిపడి ఉన్నారనే చారిత్రక ఆధారాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన వెలువడలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!