
రాజకీయాలు

శర్వానంద్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైనప్పటి నుంచి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాకు 'జార్జ్ క్రిష్' అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే పూజా కార్యక్రమాలు పూర్తైనప్పటికీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇప్పటివరకు ప్రారంభం కాలేదు.
తాజాగా నిర్మాత అనిల్ సుంకర తొలి షూటింగ్ షెడ్యూల్ ఆగస్టు రెండో వారం నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించారు. మొదటి షెడ్యూల్లో హీరో, హీరోయిన్ పాల్గొనరని, రెండో షెడ్యూల్లో వారి లవ్ సన్నివేశాలను చిత్రీకరించే అవకాశం ఉందని సమాచారం. హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే పేరు వినిపిస్తున్నప్పటికీ దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!