

దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించనున్న తదుపరి భారీ ప్రాజెక్ట్ ‘ఆర్యావర్త్’ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తుండగా.. NTR, ఫహాద్ ఫాజిల్, పృథ్వీరాజ్ సుకుమారన్లను కీలక సమాంతర ప్రధాన పాత్రల కోసం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక హీరోయిన్ల విషయంలో యామీ గౌతమ్, దీపికా పదుకొణె పేర్లు కూడా వినిపిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్పై అంచనాలు మరింత పెరిగాయి.
ఈ కాంబినేషన్ నిజమైతే బాలీవుడ్, దక్షిణాది చిత్ర పరిశ్రమలకు చెందిన అగ్ర నటీనటులు ఒకే సినిమాలో కనిపించే అవకాశం ఉంది. ‘ఆర్యావర్త్’ చిత్రాన్ని 2027 వేసవిలో ప్రారంభించి, 2028లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్, NTR, ఫహాద్ ఫాజిల్, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి నటులు కలిసి నటిస్తే ఇది 2028లో అత్యంత ఆసక్తి రేకెత్తించే పాన్-ఇండియా చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. అయితే ఈ కాస్టింగ్పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!