
జనరల్

యూట్యూబర్ జోసెఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన అన్ని కేసులను ఒకే కేసుగా పరిగణించి విచారణ జరపాలని కోర్టును కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే తనపై నమోదైన అన్ని కేసులపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కూడా విజ్ఞప్తి చేశారు.
ఈ పిటిషన్లో ఏపీ ప్రభుత్వం, డీజీపీ, ఏలూరు, ఎన్టీఆర్, కాకినాడ జిల్లాల ఎస్పీలు, పాయకరావుపేట, పిఠాపురం, మచిలీపట్నం, సర్పవరం పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్వోలను ప్రతివాదులుగా చేర్చారు. జోసెఫ్ పిటిషన్పై ఏపీ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!