
జనరల్

విశాఖపట్నం నుంచి ఈ నెల 1న చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిని అప్పలరాజు, బండియ్య, గరగయ్య, సీతుడు, చిన్న అమ్మోరు, కారి చిన్న, చిన్నయ్యగా గుర్తించారు. వారి మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న అధికారులు మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. భారత నౌకాదళం, మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డ్ సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. గల్లంతైన వారిలో ఆరుగురు భోగాపురం ముక్కాం గ్రామానికి చెందినవారు కాగా, మరొకరు భీమిలి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!