
టెక్నాలజీ

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. బ్రిటిష్ పాలనకు ధైర్యంగా ఎదురొడ్డి, గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం కోసం జీవితాన్ని అంకితం చేసిన అల్లూరి భారత స్వాతంత్య్ర సమర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.
అల్లూరి జీవితం బాధ్యత, సేవాభావం, దేశభక్తి, సమాజం కోసం నిలబడే తత్వాన్ని నేర్పుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మరో ప్రకటనలో వంగవీటి మోహన రంగా జయంతి సందర్భంగా కూడా ఆయనకు నివాళులు అర్పిస్తూ, పేదల పక్షాన నిలిచిన ప్రజా నాయకుడిగా కొనియాడారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!