
జనరల్

తమిళనాడు రాజకీయాల్లో ప్రముఖ నటి గౌతమి తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిసామికి రాసిన లేఖలో ఆమె పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ప్రచార ఉప కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సమాజ సేవను మరింత సమర్థవంతంగా కొనసాగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
పార్టీలో చేరిన నాటి నుంచి తనకు సహకరించిన నాయకులు, మాజీ మంత్రులు, జిల్లా కార్యదర్శులు మరియు కార్యకర్తలందరికీ గౌతమి కృతజ్ఞతలు తెలిపారు. భాజపాలో రెండు దశాబ్దాలకు పైగా చురుకుగా పనిచేసిన ఆమె 2023లో ఆ పార్టీని వీడి, 2024లో అన్నాడీఎంకేలో చేరారు. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం ఆమె భవిష్యత్ రాజకీయ ప్రణాళికలపై కొత్త చర్చకు దారితీసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!