
సినిమాలు

చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఈ ఏడాది సెప్టెంబర్లో భారత్ను సందర్శించే అవకాశముందని దౌత్య వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. ఈ పర్యటన ఖరారైతే, 2020 గల్వాన్ లోయ ఘర్షణల తర్వాత షీ జిన్పింగ్ భారత్కు రావడం ఇదే తొలిసారి అవుతుంది.
2019 అక్టోబర్లో చివరిసారిగా భారత్ను సందర్శించిన షీ జిన్పింగ్ అనంతరం ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగాయి. బ్రిక్స్ సదస్సుకు ముందు సరిహద్దు సమస్యలపై దౌత్య చర్చలు, ఉన్నతస్థాయి సమావేశాలు వేగవంతం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ పర్యటనపై ఇప్పటివరకు భారత్ లేదా చైనా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!