
సినిమాలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న పరస్పర దాడుల నేపథ్యంలో ప్రాంతీయ పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఈ ఘర్షణలు పూర్తిస్థాయి యుద్ధంగా మారే అవకాశం ఉందా అనే భయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఒమన్ తీరానికి సమీపంలో రెండు యూఏఈ ట్యాంకర్లపై జరిగిన దాడిలో ఒక భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనలో మరో ఆరుగురు భారతీయులు, ఇద్దరు ఉక్రెయిన్ పౌరులు గాయపడినట్లు యూఏఈ రక్షణ శాఖ వెల్లడించింది. సముద్ర మార్గాల్లో భద్రతపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం పరిస్థితులను నిశితంగా గమనిస్తోంది. పశ్చిమాసియా పరిణామాలు ప్రపంచ వాణిజ్యం, ఇంధన సరఫరాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!