

సైబర్ మోసాలు, టెలికాం ఆధారిత నేరాలను సమర్థంగా ఎదుర్కొనే లక్ష్యంతో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) హైదరాబాద్ యూనిట్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి భద్రతా సదస్సు నిర్వహించారు. ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. టెలికాం డైరెక్టర్ జనరల్ ఆనంద్ ఖారే, స్పెషల్ డైరెక్టర్ జనరల్ దీపా అరోరా, హైదరాబాద్ సీపీ సజ్జనార్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ హర్షవర్ధన్, సీఐడీ, ఆర్బీఐ, ఎస్బీఐ, టెలికాం సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
సదస్సులో ఆనంద్ ఖారే మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 5 కోట్లకు పైగా నకిలీ మొబైల్ కనెక్షన్లను తొలగించినట్లు, అలాగే పోయిన లేదా చోరీకి గురైన 12 లక్షలకు పైగా మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. సైబర్ మోసాల నియంత్రణ కోసం చేపట్టిన ‘ఆపరేషన్ ఆక్టోపస్’ విజయవంతమైందని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. టెలికాం రంగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగంపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నివేదిక సమర్పించగా, సైబర్ నేరాలపై అధికారులు ప్రత్యేక ప్రజెంటేషన్లు ఇచ్చారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!