

ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా కాంగో, ఉగాండా, సూడాన్ వంటి ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన విద్యార్థుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. గీతం, ఆంధ్ర యూనివర్సిటీల్లో చదువుతున్న 400 మందికిపైగా ఆఫ్రికా విద్యార్థులపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోంది. ప్రస్తుతం కొంతమంది విద్యార్థులు విశాఖలో ఉండగా, మరికొందరు తమ స్వదేశాలకు వెళ్లినట్లు సమాచారం. త్వరలో తిరిగి విశాఖకు రానున్న విద్యార్థుల వివరాలను కూడా అధికారులు నమోదు చేస్తున్నారు.
విశాఖ విమానాశ్రయంలో ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తున్నారు. సింగపూర్, హైదరాబాద్, బెంగళూరు మార్గాల ద్వారా వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులపై కఠిన తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు. విదేశీ ప్రయాణికులతో పాటు దేశీయ ప్రయాణికులకు కూడా ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కొత్త అడ్మిషన్ల కోసం జూన్లో మరిన్ని విద్యార్థులు రానుండటంతో ముందస్తు జాగ్రత్తలు మరింత కట్టుదిట్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!