
జనరల్

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ వినియోగదారులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆధార్లో ఈమెయిల్ చిరునామా అప్డేట్ చేసుకోవడానికి వసూలు చేస్తున్న రూ.75 ఫీజును ఆరు నెలల పాటు పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సదుపాయం 2026 జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది.
యూఐడీఏఐ తెలిపిన వివరాల ప్రకారం, ఆధార్ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే ఈ ఉచిత సేవ అందుబాటులో ఉంటుంది. ఆధార్కు ఈమెయిల్ ఐడీ లింక్ చేయడం ద్వారా ముఖ్యమైన నోటిఫికేషన్లు, సేవలకు సంబంధించిన సమాచారం వెంటనే పొందవచ్చు. మొబైల్ నంబర్ అప్డేట్, అడ్రస్ మార్పు, బయోమెట్రిక్ లాక్/అన్లాక్, ఈ-ఆధార్ డౌన్లోడ్, అథెంటికేషన్ హిస్టరీ వంటి సేవలు కూడా యాప్లో అందుబాటులో ఉన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!