
జనరల్

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రహస్యంగా యూఏఈలో పర్యటించారన్న వార్తలు చర్చనీయాంశమయ్యాయి. అయితే ఈ ప్రచారాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ఖండించింది. నెతన్యాహు మాత్రమే కాకుండా ఇజ్రాయెల్ సైనిక బృందం కూడా తమ దేశంలో పర్యటించలేదని స్పష్టం చేసింది.
ఇజ్రాయెల్తో తమ సంబంధాలు అబ్రహం ఒప్పందాల ప్రకారం పూర్తిగా బహిరంగంగానే కొనసాగుతున్నాయని యూఏఈ తెలిపింది. రహస్య పర్యటనల వార్తలు ఆధారంలేనివని పేర్కొంది. అయితే నెతన్యాహు కార్యాలయం తరువాత ఆయన యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ను కలిసినట్లు ధృవీకరించింది. ఈ పరిణామం ఇరాన్తో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ప్రాధాన్యం సంతరించుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!