

‘కేజీఎఫ్’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి, ‘కేజీఎఫ్ 2’ తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారారు. ప్రస్తుతం వెంకటేష్–త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలో నటిస్తున్న ఆమెకు మరో క్రేజీ అవకాశం దక్కినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దర్శకుడు అనుప్ భండారి తెరకెక్కించనున్న కొత్త ప్రాజెక్ట్తో శ్రీనిధి శెట్టి మరోసారి కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం.
అనుప్ భండారి తన సోదరుడు నిరూప్ భండారితో కలిసి ఈ కొత్త చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో శ్రీనిధి శెట్టి కథానాయికగా ఎంపికైనట్లు సమాచారం. ఇప్పటికే కర్ణాటకలోని కుమ్టా ప్రాంతంలో షూటింగ్ ప్రారంభమైనట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ‘రంగీతరంగ’, ‘రాజరథ’, ‘విక్రాంత్ రోణా’ తర్వాత అనుప్, నిరూప్ భండారిల కాంబినేషన్లో వస్తున్న నాలుగో చిత్రమిది. శ్రీనిధి రీఎంట్రీతో ఈ ప్రాజెక్ట్పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!